లక్ష మందితో ముల్లైపెరియార్ డ్యాం ముట్టడి
ABN , First Publish Date - 2021-11-09T15:00:18+05:30 IST
ముల్లైపెరియార్ డ్యాంలో 142 అడుగుల నీటి ని నిల్వ చేసేలా రాష్ట్రప్రభుత్వం చర్య లు చేపట్టాలని, లేకపోతే లక్ష మందితో ముల్లైపెరియార్ డ్యాం ముట్టడి చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
- BJP రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
పెరంబూర్(చెన్నై): ముల్లైపెరియార్ డ్యాంలో 142 అడుగుల నీటి ని నిల్వ చేసేలా రాష్ట్రప్రభుత్వం చర్య లు చేపట్టాలని, లేకపోతే లక్ష మందితో ముల్లైపెరియార్ డ్యాం ముట్టడి చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు. ముల్లైపెరియార్ డ్యాం కేరళ ప్రభుత్వ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతను వ్యతిరేకిస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో తేనిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ, ముల్లైపెరియార్ డ్యాం నుంచి కేరళ రాష్ట్రానికి నీటిని విడుదల చేయడంపై రాష్ట్ర ప్రజలు, రైతులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.