సీనియర్ ఐఏఎస్ అభయ్ త్రిపాఠి మృతి
ABN , First Publish Date - 2021-12-20T09:30:23+05:30 IST
ఢిల్లీలోని ఆంధ్ర భవన్ మాజీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అభయ్ త్రిపాఠి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్లో మరణించారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఆంధ్ర భవన్ మాజీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అభయ్ త్రిపాఠి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్లో మరణించారు. ఆయన మరణం పట్ల ఏపీ భవన్ అధికారులు, ఉద్యోగులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. త్రిపాఠి మరణం పట్ల ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెండ్ కమిషనర్ భావనా సక్సేనా, స్పెషల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి, ఇతర అధికారులు సంతాపం తెలిపారు. త్రిపాఠి కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశా రు. అభయ్ త్రిపాఠీ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయన 2019 నవంబరు 27న ఢిల్లీలోని ఆంధ్రభవన్కు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. 2021 జూలై 31న పదవీ విరమణ పొందారు. త్రిపాఠి 1961లో పాట్నాలో జన్మించారు. చరిత్రలో పీజీ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ర్టేటజిక్ స్టడీ్సలో ఎంఫిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కేడర్లో ఐఏఎ్సకు 1986లో ఎంపికైన ఆయన... చిత్తూరు సబ్ కలెక్టర్గా, తుడా వైస్చైర్మన్గా, పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా, విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్గా, నిజామాబాద్ కలెక్టర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా న్యూఢిల్లీలోనూ, 2001-02లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా పనిచేశారు.