ఎయిమ్స్ నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జి
ABN , First Publish Date - 2021-06-29T21:06:57+05:30 IST
కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ మంగళవారంనాడు ఎయిమ్స్..
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ మంగళవారంనాడు ఎయిమ్స్ నుండి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ అనంతర సమస్యలతో ఆయన జూన్ 1న ఆసుపత్రిలో చేరారు. పూర్తి స్వస్థత చేకూరడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్టు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్ 21న ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. కొద్దిరోజుల్లోనే కోలుకుని తిరిగి విధులకు హాజరయ్యారు. అయితే మళ్లీ కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో కొంత సమయాన్ని ఆయన కవితలు రావడానికి వెచ్చించేవారు. తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, దానిని ఏవిధంగా అధిగమించాననే విషయాలను అందులో పొందుపరిచారు.