పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు
ABN , First Publish Date - 2021-12-08T06:15:22+05:30 IST
ఈ నెల 10న జరుగనున్న శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరి శీలకుడు నవీన్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మంగళవారం పరిశీలించారు. కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తిరిగి వచ్చే మార్గాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు కేంద్రంలో కల్పించిన మౌళిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల నియ మావళి ఉల్లంఘన ఎక్కడ జరగలేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో రమేష్ రాథోడ్, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 10న జరుగనున్న శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరి శీలకుడు నవీన్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మంగళవారం పరిశీలించారు. కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తిరిగి వచ్చే మార్గాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు కేంద్రంలో కల్పించిన మౌళిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల నియ మావళి ఉల్లంఘన ఎక్కడ జరగలేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో రమేష్ రాథోడ్, సిబ్బంది పాల్గొన్నారు.