సాగర్లో గెలుపుపై టీఆర్ఎస్ నాయకుల సంబరాలు
ABN , First Publish Date - 2021-05-03T03:51:25+05:30 IST
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భరత్ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల ఆదివారం కౌటాలలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకు న్నారు.
కౌటాల, మే 2: నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భరత్ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల ఆదివారం కౌటాలలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకు న్నారు. ఈ సందర్భంగా టపాకా యలు కాల్చి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో నాయకులు శ్రీని వాస్గౌడ్, రవీందర్గౌడ్, సర్పంచ్ మౌనీష్, ఉపసర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ మనీష్, అజ్మత్ అలీ, బాపు, సంతోష్, రాంచందర్ పాల్గొన్నారు.
కాగజ్నగర్లో..
కాగజ్నగర్ టౌన్, మే 2: కాగజ్నగర్లో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మెన్ కోనేరు క్రిష్ణారావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.