అవకతవకలపై విచారణ జరపాలి
ABN , First Publish Date - 2021-12-26T05:41:23+05:30 IST
టీచర్ల జి ల్లాల కేటాయింపుల్లో అవకత వకలపై తక్షణం విచారణ జరి పించి అందరికీ న్యాయం చే యాలని టీపీఆర్టీయూ వ్యవ స్థాపక అధ్యక్షుడు జీ.హర్షవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
- టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి
మహబూబ్నగర్ (కలెక్టరే ట్), డిసెంబరు 25 : టీచర్ల జి ల్లాల కేటాయింపుల్లో అవకత వకలపై తక్షణం విచారణ జరి పించి అందరికీ న్యాయం చే యాలని టీపీఆర్టీయూ వ్యవ స్థాపక అధ్యక్షుడు జీ.హర్షవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్ ఎస్.వెంకట్రావును కలిసి డిమాండ్లతో కూడిన వినతిప త్రం అందజేశారు. ఇదే అంశంపై అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఈవో ఉషారాణిని సైతం కలిసి కేటాయింపులు, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. నాలుగు రోజులుగా డీఈవో కార్యాలయంలో ఈ పొరపాట్లపై 2900 మంది ఉపాధ్యాయులు ఫిర్యాదులు చేశార ని తెలిపారు. ఆ ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సబ్జెక్టుల వారీగా, కేడర్ వారీగా సీనియార్టీ లిస్టు వెలువరించి అలాట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై కలెక్టర్ చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి మరో నాలు గు రోజులు సమయం తీసుకొని ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు.