ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2021-02-06T04:45:23+05:30 IST
మండల పరిధిలోని ఉప్పర్పల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొని ఉప్పర్పల్లికి చెందిన రాము (42)కు తీవ్ర గాయాలయ్యాయి.
మక్తల్రూరల్, ఫిబ్రవరి 5 : మండల పరిధిలోని ఉప్పర్పల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొని ఉప్పర్పల్లికి చెందిన రాము (42)కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై మొక్కలకు ట్రీ గార్డులు అమర్చుతుండగా బస్సు ఢీకొన్నది. క్షతగాత్రున్ని మొదట మక్తల్ ప్రభుత్వ ఆసుప త్రికి, అక్కడి నుంచి మహబూబ్గనర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ బాల రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.