చెక్డ్యాంల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-04-04T04:19:08+05:30 IST
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శనివారం కోస్గి, మద్దూర్ మండ లాల్లో పర్యటించారు.
కోస్గి రూరల్/ మద్దూర్, ఏప్రిల్ 3 : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శనివారం కోస్గి, మద్దూర్ మండ లాల్లో పర్యటించారు. మద్దూ రు మండలం ఎక్కామేడ్ గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోస్గితోపాటు, చెన్నారం, ముశ్రిఫా గ్రామా ల్లో అభివృద్ధి పనులతోపాటు చెక్డ్యాంలకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక వ్యసాయ సహకా ర సంఘం భవనం, అదనపు గదులను ప్రారంభించారు.