‘టీటీడీ స్థలంలో ఎలాంటి కట్టడాలూ చేపట్టొద్దు’
ABN , First Publish Date - 2021-07-09T05:26:13+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం స్థలంలో ఎలాంటి కట్టడాలు చేపట్ట వద్దంటూ గురువారం హిందూధార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
జడ్చర్ల, జూలై 8 : తిరుమల తిరుపతి దేవస్థానం స్థలంలో ఎలాంటి కట్టడాలు చేపట్ట వద్దంటూ గురువారం హిందూధార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జడ్చర్ల పట్ట ణంలోని సాయినగర్కాలనీలోని సాయిమందిరానికి వెళ్లే దారిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్థలంలో కల్యాణమండపం నిర్మాణం చేపట్టాలని, ఇతర కట్టడాలు చేయవద్దంటూ డిమాండ్ చేశారు. టీటీడీ స్థలంగా పేర్కొంటూ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మికసంఘం నాయకులు పాల్గొన్నారు.