భగవద్గీత పారాయణంతో సకల శుభాలు
ABN , First Publish Date - 2021-12-27T04:38:38+05:30 IST
భగవద్గీత పారాయణంతో సకల శుభాలు కలుగుతాయని తొగుట రాంపూర్ పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి అన్నారు.
తొగుట రాంపూర్ పీఠాధిపతి మాధవనంద సరస్వతి
మిరుదొడ్డి, డిసెంబరు26: భగవద్గీత పారాయణంతో సకల శుభాలు కలుగుతాయని తొగుట రాంపూర్ పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి అన్నారు. ఆదివారం మిరుదొడ్డిలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో చిన్మయమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వరూపం సుదర్శనలో యాగంలో భాగంగా శ్రీ మహావిష్ణువు విగ్రహానికి 108 కిలోలతో పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు రాజపున్నయ్య శర్మ, చంద్రశేఖరశర్మ, చిన్మయ మిషన్ సభ్యులు నర్సింహులు, బాల్రాజు, రవి, భాస్కర్, వీరేశంగౌడ్ తదితరులున్నారు.