ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-11-23T06:12:50+05:30 IST
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 76ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో
భువనగిరి రూరల్, నవంబరు 22: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 76ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 42ఫిర్యాదులు రెవెన్యూ, భూసమస్యలకు సంబంధించినవి మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఆసరా పింఛన్లకు సంబంధించి మరో 34 ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. విజయకుమారి, మల్లికార్జున్ ఉన్నారు.