‘ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి’
ABN , First Publish Date - 2021-07-12T07:07:27+05:30 IST
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి కోరారు.
ఆలేరు, జూలై 11: మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి కోరారు. ఆలేరులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్రావు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు ఉదయం 10 గంటలకు ఒకే గంటలో 3 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలను ప్రజలు 9000365000 నంబరుకు వాట్సాప్ చేసి వీఐసీ అని మెసేజ్ చేయాలన్నారు. మొక్కలు నాటుతున్న సెల్ఫీ అప్లోడ్ చేయాలన్నారు. అలా చేసినవారికి మంత్రి కేటీఆర్ నుంచి ‘వనమాలి’ బిరుదును మొబైల్ ద్వారా వారం రోజుల్లో వస్తుందన్నారు.