లేపాక్షి ఆలయానికి జీ-20 శోభ
ABN , First Publish Date - 2022-12-02T03:26:55+05:30 IST
అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం జీ-20 శోభను సంతరించుకుంది.

న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం జీ-20 శోభను సంతరించుకుంది. భారతదేశం గురువారం జీ-20 అధ్యక్ష స్థానం చేపట్టిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు చారిత్రక ప్రదేశాలను జీ-20 శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా లేపాక్షి ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని గోల్కొండ కోట, చార్మినార్తో పాటు.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఈ వేడుకలు ఏడాది పాటు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా మొత్తం 100 ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో జీ-20 లోగోను కూడా ప్రదర్శిస్తారు.