గాలిపడుతుండగా ఆటో టైరు పేలి ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-10-18T06:11:48+05:30 IST

గాలి పడుతుండగా ఆటో టైరు పేలడంతో మురళి (55) మృతి చెందారు. ఈ ఘటన సోమవారం విజయపురం మండలంలోని పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద జరిగింది.

గాలిపడుతుండగా ఆటో టైరు పేలి ఒకరి మృతి
మురళి (ఫైల్‌ ఫొటో)

విజయపురం, అక్టోబరు 17: గాలి పడుతుండగా ఆటో టైరు పేలడంతో మురళి (55) మృతి చెందారు. ఈ ఘటన సోమవారం విజయపురం మండలంలోని పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద జరిగింది. ఎల్లసముద్రం గ్రామానికి చెందిన మురళి బతుకు తెరువుకోసం పన్నూరు సబ్‌స్టేషన్‌లో 30 ఏళ్లుగా పంక్చరు షాపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోకు గాలి పడుతుండగా టైరు పేలింది. టైరు చుట్టూ ఉన్న ఇనుపకమ్మీ మురళి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనుచరుల ద్వారా మంత్రి రోజా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ అధ్యక్షురాలు శాంతి, ఆర్బీకే చైర్మన్‌ గుణశేఖర్‌రెడ్డి, సర్పంచులు కుమార్‌, శ్రీరాములురెడ్డి, వైసీపీ నాయకులు సతీ్‌షయాదవ్‌, అంగముత్తు, నాగరాజు, హరీష్‌ తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. 


Updated Date - 2022-10-18T06:11:48+05:30 IST