Tirupathi: నలుగురు విద్యార్థుల అదృశ్యం

ABN , First Publish Date - 2022-12-08T14:46:47+05:30 IST

తిరుపతి: మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్ధులు (Students) కనిపించకుండా పోయారు. బుధవారం ఉదయం పాఠశాలకు (School) వెళ్లిన విద్యార్థులు...

Tirupathi: నలుగురు విద్యార్థుల అదృశ్యం

తిరుపతి: మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్ధులు (Students) కనిపించకుండా పోయారు. బుధవారం ఉదయం పాఠశాలకు (School) వెళ్లిన విద్యార్థులు సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలను వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో గురువారం ఉదయం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. విద్యార్థులు నిన్న మధ్యాహ్నం కపిల్ తీర్థం వెళ్లి స్నానం చేశారు. అక్కడి నుంచి లీల మహల్ సర్కిల్‌కు వచ్చారు. అనంతరం అందరూ మాట్లాడుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లాలి అనేది వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఎక్కడికి వెళ్లారో తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-12-08T14:46:51+05:30 IST