రైతులు నిరీక్షిస్తున్నా స్పందన కరువు

ABN , First Publish Date - 2022-12-14T00:05:34+05:30 IST

సార్వాలో పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక నాలుగువారాలుగా రైతులు నిరీక్షిస్తున్నా ప్రభుత్వంలో స్పం దన కరువైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించా రు. గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో కళ్లా ల్లో ఉండిపో

రైతులు నిరీక్షిస్తున్నా స్పందన కరువు
తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 13: సార్వాలో పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక నాలుగువారాలుగా రైతులు నిరీక్షిస్తున్నా ప్రభుత్వంలో స్పం దన కరువైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించా రు. గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో కళ్లా ల్లో ఉండిపోయిన ధాన్యం రాశులను ఆయన మ ంగళవారం పరిశీలించారు. రైతుభరోసా కేంద్రా న్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. తేమ వ ల్ల ఒకి కిలో తగ్గించి ధాన్యం ఇవ్వడానికి రైతులు సిద్ధపడుతున్నా కొనడంలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మరో తుఫాన్‌ రానున్నదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని, రైతుల నుంచి ధాన్యం కొనకుంటే మళ్లీ తుఫాన్‌ బారిన పడే అవకాశంఉందని తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, పాలపర్తి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T00:05:35+05:30 IST