అభివృద్ధి పనులు చేయని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-29T06:02:14+05:30 IST

సామర్లకోట, ఆగస్టు 28: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అడ్డంకులు కల్పించడం, టీడీపీ నాయకులపై దౌన్జన్యాలు చేయడం మినహా మరే అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం చేయలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.

అభివృద్ధి పనులు చేయని ప్రభుత్వం
ప్రజలకు కరపత్రాలు అందజేస్తున్న రాజప్ప

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజప్ప 

సామర్లకోట, ఆగస్టు 28: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అడ్డంకులు కల్పించడం, టీడీపీ నాయకులపై దౌన్జన్యాలు చేయడం మినహా మరే అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం చేయలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఆదివారం మండలంలోని పవర, పండ్రవాడ గ్రామాల పరిధిలో టీడీపీ గౌరవసభ, బాదుడే బాదుడే నిరసన కార్యక్రమాలను మాజీ వైస్‌ ఎంపీపీ ఆకునూరి సత్తిబాబు ఆద్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చినరాజప్ప గౌరవసభలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయా ంలో జరిగిన అభివృద్ధి తప్ప మూడేళ్ళ వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులురావని వెనుకకుపోతున్నా ఈ ప్రభుత్వానికి తెలిసిరావడం లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పన్నులు, చార్జీల పెంపుదల వంటి అంశాలపై కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఆకునూరి సత్తిబాబు, ముచ్చెర్ల కళ్యాణ్‌, పరిమి శ్రీను, కండిల్లి తాతారావు, ఆలపాటి దర్మరాజు, నరవ వెంకటరమణ తదితరులున్నారు.

Updated Date - 2022-08-29T06:02:14+05:30 IST