Anagani Satya prasad: నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-12-11T20:17:30+05:30 IST

Amaravathi: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. లక్షల్లో పెట్టుబడిన పెట్టిన రైతుల్ని వర్షాలు దెబ్బతీశాయని, నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవటం

Anagani Satya prasad: నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Amaravathi: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. లక్షల్లో పెట్టుబడిన పెట్టిన రైతుల్ని వర్షాలు దెబ్బతీశాయని, నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవటం బాధాకరమన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రకాశం, బాపట్ల, తూర్పు గోదావది, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, పత్తి, మిరప పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు నీటమునిగాయని తెలిపారు. 175కు 175 సీట్లని అరవడం కాదని, కనీసం 175 మంది రైతులనైనా ఆదుకోవాలని కోరారు.

Updated Date - 2022-12-11T20:17:31+05:30 IST