కొండాపురంలో రైళ్లు ఆపాలి

ABN , First Publish Date - 2022-11-09T23:36:13+05:30 IST

కొండాపురం రైల్వే స్టేషన్‌తో పాటు ముద్దనూరులో రైళ్లను ఆపాలని జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నారాయణస్వామి ని కలసి మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవగుడి ఆదినారాయణరెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు.

కొండాపురంలో రైళ్లు ఆపాలి

కేంద్రమంత్రికి మాజీ మంత్రి ఆది వినతి

కొండాపురం, నవంబరు 9: కొండాపురం రైల్వే స్టేషన్‌తో పాటు ముద్దనూరులో రైళ్లను ఆపాలని జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నారాయణస్వామి ని కలసి మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవగుడి ఆదినారాయణరెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపురం రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలని ఢిల్లీలో రైల్వేమంత్రి హర్షిణి వైష్ణవ్‌ను కలిశామన్నారు. మరోమారు తక్షణం రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నారాయణస్వామికి వినతిపత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్ణాటి యల్లారెడ్డి, రైల్వే బోర్డు మెంబర్‌ దేవగుడి శివనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-09T23:36:15+05:30 IST