మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-11-20T23:52:50+05:30 IST

విజయవాడ- మచిలీపట్నం రహదారిపై గండిగుంట గ్రామ పం చాయతీ పరిధి ఆనందపురం వద్ద శనివారం రాత్రి రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడు మరణిం చగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

 మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడి మృతి

ఉయ్యూరు, నవంబరు 20 : విజయవాడ- మచిలీపట్నం రహదారిపై గండిగుంట గ్రామ పం చాయతీ పరిధి ఆనందపురం వద్ద శనివారం రాత్రి రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని యువకుడు మరణిం చగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం దావులూరుకు చెదిన రావూరి ప్రేమ్‌కుమార్‌(26) ఉయ్యూరులో ఓ వేడుకకు హాజరై మోటార్‌సైకిల్‌పై తిరిగి వెళుతూ ముందు వెళుతున్న మరో మోటార్‌ సైకిల్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ప్రేమ్‌కుమార్‌తో పాటు మరో మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఉయ్యూరుకు చెందిన జి.అనిల్‌కుమార్‌కు తీవ్రగాయ్యాయి. ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ప్రేమ్‌కుమార్‌ మరణించగా అనిల్‌ కుమార్‌ చిక్సిత పొందుతున్నాడు. కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై ఎన్‌.వీరప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-11-20T23:52:52+05:30 IST