విద్యార్థులు చక్కగా చదువుకోవాలి

ABN , First Publish Date - 2022-12-01T00:05:51+05:30 IST

జిల్లాలోని 50,148 మం ది విద్యార్థులకు రూ.26.97 కోట్ల విద్యా దీవెన నిధులు మం జూరు చేశామని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు.

విద్యార్థులు చక్కగా చదువుకోవాలి

కలెక్టరేట్‌, నవంబరు 30: జిల్లాలోని 50,148 మం ది విద్యార్థులకు రూ.26.97 కోట్ల విద్యా దీవెన నిధులు మం జూరు చేశామని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు. సీఎం జగన్‌ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం బటన్‌ నొక్కి, విద్యార్థులు తల్లుల ఖాతాలో నిధులను జమ చేశా రు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌టెలీకాస్ట్‌ ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ విద్యా దీవెన పథకం ద్వారా బీసీలు 40,408 మంది, ఎస్సీలు 4,843 మంది, ఈబీసీలు 2,843, కాపు 1,007, ముస్లిం 248, క్రిష్టి యన్లు 42 మందికి ఈ నిధులు విడుదల చేసినట్లు తెలి పారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని బాగా చదవాలని కోరారు. విద్యా దీవెన పథకం చెక్కును విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో జేసీ మయూర్‌ అశోక్‌, డీఆర్‌వో గణపతి రావు, బీసీ సంక్షేమాధికారి యశోదరావు, గిరిజన సంక్షేమా ధికారి చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-01T00:05:52+05:30 IST