కేదార్‌నాథ్‌ గర్భగుడికి బంగారు పూత

ABN , First Publish Date - 2022-10-27T06:14:26+05:30 IST

కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలోని పైకప్పు, గోడలకు బంగారు పూత పూర్తైంది. శ్రీ బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌

కేదార్‌నాథ్‌ గర్భగుడికి బంగారు పూత

పూర్తైందన్న ఆలయ కమిటీ

కేదార్‌నాథ్‌, అక్టోబరు 26: కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలోని పైకప్పు, గోడలకు బంగారు పూత పూర్తైంది. శ్రీ బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం ఉదయమే పనులు పూర్తైనట్లు పేర్కొన్నారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ)కు చెందిన ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో 19 మంది నిపుణులైన స్వర్ణకారులు మూడు రోజుల పాటు శ్రమించి బంగారు పూత వేశారని తెలిపారు. ఇదిలా ఉండగా, చలికాలం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ఆలయాన్ని బుధవారం మూసివేశారు. 6 నెలల పాటు ఆలయం మూసి ఉంటుంది.

Updated Date - 2022-10-27T06:15:05+05:30 IST