Punjab: శివసేన నేత కాల్చివేత

ABN , First Publish Date - 2022-11-04T16:25:39+05:30 IST

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం పట్టపగలే దారుణం జరిగింది. శివనేత నేత సుధీర్ సూరి హత్యకు..

Punjab: శివసేన నేత కాల్చివేత

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం పట్టపగలే దారుణం జరిగింది. శివనేత (Shiva sena) నేత సుధీర్ సూరి (Sudhir suri) హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఆలయం వెలుపల ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలుపుతుండగా అక్కడి గుంపులోంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఎ.30 పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక నేతలు నిరసనలకు దిగారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి పంజాబ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలినట్టు శివసేన పంజాబ్ అధ్యక్షుడు యోగిరాజ్ శర్మ ఆరోపించారు.

Updated Date - 2022-11-04T18:09:22+05:30 IST