Smriti Irani:రాహుల్ గాంధీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి...కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-27T05:53:02+05:30 IST

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాజాగా కొవిడ్ ప్రోటోకాల్ అనుసరించాలని సూచించారు....

Smriti Irani:రాహుల్ గాంధీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి...కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు

అమేఠి(ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాజాగా కొవిడ్ ప్రోటోకాల్ అనుసరించాలని సూచించారు.(Smriti Irani) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన లోక్‌సభ నియోజకవర్గం అమేఠీలో పర్యటించిన సందర్భంగా సీనియర్ సిటిజన్‌తో సంభాషించారు.రాహుల్ గాంధీ( Rahul Gandhi) బాధ్యతతో వ్యవహరించాలని స్మృతిఇరానీ సలహా ఇచ్చారు. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra), కొవిడ్ కొత్త వేరియంట్ లపై కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.‘‘రాహుల్ జీ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను(Covid protocol) అనుసరించాలి... ప్రజల పట్ల బాధ్యతను అర్థం చేసుకోవాలి’’ అని స్మృతి అన్నారు.భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించమని రాహుల్ గాంధీకి సలహా ఇచ్చిన రెండవ కేంద్రమంత్రి ఇరానీ.

Updated Date - 2022-12-27T07:12:29+05:30 IST