Indian students: క్రిమియాలో కారు ప్రమాదం...నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2022-12-30T05:06:04+05:30 IST

క్రిమియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించారు...

Indian students: క్రిమియాలో కారు ప్రమాదం...నలుగురు భారతీయ విద్యార్థుల మృతి
Fatal Car Accident in Crimea

సింఫెరోపోల్ (క్రిమియా): క్రిమియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించారు.(Crimea) సింఫెరోపోల్ నగరంలో భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది.(Fatal Car Accident) ఈ కారు ప్రమాదంలో మరణించిన వారు భారతీయ వైద్య విద్యార్థులని(Indian students killed) క్రిమియా దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన ఘోర ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇద్దరు విద్యార్థులు కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుండగా, మరో ఇద్దరు నాలుగో సంవత్సరంలో ఉన్నారు.రెనాల్ట్ లోగాన్ - సెర్జీవ్-ట్సెన్స్కీ స్ట్రీట్ నుంచి క్రిమియాలోని సెయింట్ సింఫెరోపోల్ వైపు వస్తుండగా కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టారని ప్రాథమిక సమాచారం. మరణించిన భారతీయ విద్యార్థుల కుటుంబాల్లో విషాదం అలముకుంది.

Updated Date - 2022-12-30T06:44:07+05:30 IST