Home » Indians
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్లో డాటా సైంటిస్ట్గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్లో లైన్లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఇజ్రాయెల్పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మంగళవారం చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్లో సీడెడ్ ఆటగాడిని ఓడించిన భారత్ నుంచి అతను మొదటి ఆటగాడిగా నిలిచాడు. అయితే నాగల్ ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ సపోర్ట్ చేశారనే చెప్పిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యూఏఈలో తరచుగా లాటరీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో అనేక మంది వాటిని కొనుగోలు చేసి వారి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయులు అక్కడ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేయగా వారికి కోట్ల రూపాయల బహుమతి దక్కింది.
దుబాయి నుంచి 300 మంది భారతీయులను అక్రమంగా రవాణా(Human Trafficking) చేస్తున్నారన్న సమాచారం అందటంతో సదరు ఫ్లైట్ని ఫ్రాన్స్ అధికారులు తమ దేశంలో ఆపేశారు. తరువాత చెకింగ్ చేయగా నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి.
దేశ భద్రతే ధ్యేయంగా సైనికులు నిత్యం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. అందుకే అంతా వారిని రియల్ హీరోస్ అని పిలుస్తుంటారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లు నిత్యం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయినా...
లోతైన బావి నుండి అతి కష్టంగా వినిపించే విధంగా ధ్వని... శ్రధ్ధతో వింటే గానీ వినబడదు, ముందు మోబైల్ మోగుతున్నా కనీసం ఎత్తలేని చేతులు, కదలలేని కాళ్ళు... పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరంలేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ అభాగ్యుడు.
NRI Steals Rs 183 Crore: విలాసాలకు అలవాటు పడిన ఓ ఎన్నారై పెడదారిలో డబ్బు సంపాదించాడు. దీనికోసం గతంలో తాను ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన యూఎస్ ఫుట్బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్ (Jacksonville Jaguars) కు ఏకంగా 22 మిలియన్ డాలర్లు టోకరా పెట్టాడు. మన కరెన్సీలో అక్షరాల రూ.183 కోట్లు.
New BBC Chairman Dr Samir Shah: ఇప్పటికే వివిధ దేశాల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నత స్థానాలను అధిరోహించడం జరిగింది. దిగ్గజ సాప్ట్వేర్ సంస్థలకు బాస్ నుంచి మొదలుకొని దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఎన్నారై వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.
అమెరికాలో తెలుగువారు అనేక విజయాలు సాధిస్తూ యావత్ తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా పిలిచే న్యూయార్క్ నగరంలో మున్సిపల్ ఇంజనీర్స్ ఆఫ్ సిటీ న్యూయార్క్ (ఎం.ఇ.ఎన్.వై) మీనికి అధ్యక్షురాలిగా తెలుగు ఇంజనీర్ సుధారాణి మన్నవ పదవీ బాధ్యతలు స్వీకరించారు.