పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2022-10-22T20:02:03+05:30 IST

అమరావతి: పెళ్లిళ్ల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan)పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది.

పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌

అమరావతి: పెళ్లిళ్ల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan)పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది. తక్షణమే మహిళలకు పవన్‌ క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్‌ డిమాండ్ చేసింది. పవన్‌ వ్యాఖ్యలు బాధించాయని మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy padma) అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని... మహిళలకు పవన్‌ సంజాయిషీ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ (Chairman of Women's Commission) తెలిపారు.

Updated Date - 2022-10-23T13:03:29+05:30 IST