Kriti Sanon: అతనంటే పిచ్చి.. ఆ రోజులు గుర్తొచ్చాయి!

ABN , First Publish Date - 2022-11-19T18:24:30+05:30 IST

ప్రభాస్‌ (Prabhas) అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు కృతిసనన్‌ (Kriti Sanon). తాజాగా మరోసారి ఆమె ప్రభాస్‌ గురించి (Kriti Sanon likes prabhas) చెప్పుకొచ్చారు. ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తునట్లు చెప్పుకొచ్చారు.

Kriti Sanon: అతనంటే పిచ్చి.. ఆ రోజులు గుర్తొచ్చాయి!

ప్రభాస్‌ (Prabhas) అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు కృతిసనన్‌ (Kriti Sanon). తాజాగా మరోసారి ఆమె ప్రభాస్‌ గురించి (Kriti Sanon likes prabhas) చెప్పుకొచ్చారు. ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తునట్లు చెప్పుకొచ్చారు. ‘1 నేనొక్కడినే’ (1 Nenokkadine)చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతి తర్వాత ‘దోచెయ్‌’ చిత్రంలో నటించారు. ఆ చిత్రం పరాజయం కావడంతో తెలుగుతెరపై కనిపించలేదు. హిందీలో ఆమె నటించిన ‘బేడియా’ చిత్రం ‘తోడేలు’ (Thodelu - Bhediya)టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. సినిమా ప్రచారంలో భాగంగా శనివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘1 నేనొక్కడినే’తో సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చాను. అప్పుడు హీరో మహేశ్‌ (Mahesh babu)నాకెంతో సహకరించారు. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైనందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. అనంతరం విలేకర్ల ప్రశ్నలకు కృతీసనన్‌ ఆసక్తికర సమాధానాలిచ్చారు. తనకు ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టం, పిచ్చి అని చెప్పుకొచ్చిన ఆమె ఆయనతో కలిసిన నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తునట్లు చెప్పారు. (Kriti sanon Remember old memories)

‘‘ప్యాన్‌ ఇండియా ట్రెండ్‌ వల్ల నాకేమీ ఒత్తిడి లేదు. తెలుగు సినిమాతో నా కెరీర్‌ మొదలైంది. ‘ఆదిపురుష్‌’ షూట్‌ అప్పుడు తెలుగు మాట్లాడుతుంటే నటిగా తొలి అడుగులేసిన రోజులు గుర్తొచ్చాయి. ఆర్టిస్టులం మేమంతా ఒక్కటే. మాకు భాషా భేదాలు ఉండవు. మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే మా లక్ష్యం. ఈ మఽధ్యకాలంలో వచ్చిన తెలుగు చిత్రాలు ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాగా నచ్చాయి’’ అన్నారు కృతీసనన్‌. 

Updated Date - 2022-11-19T18:31:33+05:30 IST