310 అడుగుల ఎత్తులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటో తీసుకున్న జంట.. మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2022-10-26T20:35:25+05:30 IST

స్వలింగ సంపర్కులైన (Homosexuals) వారిద్దరూ.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎవరికి ఇష్టం ఉన్నా.. లేకున్నా జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వారు మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు.. ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. అయితే..

310 అడుగుల ఎత్తులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటో తీసుకున్న జంట.. మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..

స్వలింగ సంపర్కులైన (Homosexuals) వారిద్దరూ.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎవరికి ఇష్టం ఉన్నా.. లేకున్నా జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వారు మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు.. ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. అయితే చివరకు ఓ రోజు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సుమారు 310 అడుగుల ఎత్తులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు తీసుకున్నారు. మరుక్షణమే వారు తీసుకున్న నిర్ణయంతో ఆ ఫొటో ప్రస్తుతం వైరల్‌‌గా మారింది.

Viral Video: ఇంట్లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. గాజు బాక్సు మూత తీయడంతో ఒక్కసారిగా ఏం చేసిందో చూడండి..

ఆర్మేనియా (Armenia) యెరెవాన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. జీవితాంతం కలిసి జీవించాలని అనుకున్నారు. స్నేహితులు, బంధువులు ఎగతాళి చేసినా వారు మాత్రం పట్టించుకోలేదు. అయితే ఈ విషయం వారి ఇంట్లో తెలియడంతో తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఇద్దరూ కలిసి ఉండేందుకు వీలు లేదంటూ హెచ్చరించారు. బతికితే కలిసి బతకాలని, లేదంటే కలిసే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 20న దవ్తాషేన్ వంతెన పైకి ఎక్కారు. సుమారు 310అడుగుల ఎత్తులో చివరిసారిగా ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఆ సందర్భం జీవితాంతం గుర్తుండేలా ఫొటో తీసుకున్నారు. అనంతరం వాటిని హ్యాపీ ఎండ్ అని ప్రస్తావిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram viral photos) షేర్ చేశారు. తర్వాత ఒక్కసారిగా పైనుంచి దూకి ఆత్మహత్య (suicide) చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భావోద్వేగానికి గురవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆర్మేనియాలో స్వలింగ సంపర్కులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు అనడానికి ఈ ఘటన నిదర్శనం అంటూ స్థానిక మీడియా పేర్కొంటోంది.

ప్రేయసి ఇంటికి తమ్ముడిని పంపించిన అన్న.. కుటుంబ సభ్యులకు జ్యూస్ ఇచ్చిన కూతురు.. వేకువజాము లేచి చూస్తే..

Updated Date - 2022-10-26T20:37:54+05:30 IST