శ్రుతి మించుతున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలు
ABN , First Publish Date - 2022-04-21T18:20:10+05:30 IST
రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్
హైదరాబాద్/పేట్బషీరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ ర హదారి సుచిత్ర సర్కిల్లో పెద్ద ఎత్తున్న నిరసన కార్య్రకమాన్ని బుధవారం చేపట్టారు. ధర్నా నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీఽశైలంగౌడ్తోపాటు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తుండగా కేసీఆర్ డౌన్డౌన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పోలీసులు పెద్ద ఎత్తున్న మోహరించి శ్రీశైలంగౌడ్ను పేట్బషీరాబాద్ స్టేషన్కు తరలించగా మరికొంత మందిని అల్వాల్ స్టేషన్కు తరలించారు. అనంతరం సోంతపూచికత్పై నాయకులు, కార్యకర్తలను వదిలేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.