Delhi Liquor Scam Case: కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం

ABN , First Publish Date - 2022-12-11T11:07:57+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ (CBI) బృందం ఆదివారం

Delhi Liquor Scam Case: కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ (CBI) బృందం ఆదివారం కవిత (Kavitha) ఇంటికి చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులతో పాటు తండ్రి సీఎం కేసీఆర్‌తో కవిత నోటీసులపై చర్చించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-11T11:08:03+05:30 IST