Balka suman: ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ను ఆహ్వానించకపోవడం అవమానకరం

ABN , First Publish Date - 2022-11-11T14:02:19+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించకపోవడం అవమానకరమని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.

Balka suman: ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ను ఆహ్వానించకపోవడం అవమానకరం

పెద్దపల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi పర్యటనకు సీఎం కేసీఆ (KCR)ను ఆహ్వానించకపోవడం అవమానకరమని ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka suman) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో రెండుసార్లు పీఎం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ (Telangana CM), మంత్రులను ఆహ్వానించలేదని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా గెస్ట్ ఆఫ్ హానర్‌గా సీఎం కేసీఆర్‌ను ఆహ్వనించవలసి ఉంటుందని చెప్పారు. బండి సంజయ్(Bandi sanjay), కిషన్ రెడ్డి (Kishan reddy) లకు సిగ్గు లేదా.. ఎంతకాలం చెప్పులు, బూట్లు మోస్తారని యెద్దేవా చేశారు. తెలంగాణ(Telangana)పై ప్రధాని వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని అన్నారు. ఎప్పుడో ప్రారంభం అయిన ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని బాల్క సుమన్(TRS MLA)డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-11T14:02:21+05:30 IST