బొప్పల్లిలో ఎమ్మెల్యే ‘గుడ్‌మార్నింగ్‌ నాగర్‌కర్నూల్‌’

ABN , First Publish Date - 2022-11-28T23:20:15+05:30 IST

మండల పరిధిలోని బొప్పల్లిలో సోమవారం నిర్వహించిన ‘గుడ్‌ మార్నింగ్‌ నాగర్‌కర్నూల్‌’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

బొప్పల్లిలో ఎమ్మెల్యే ‘గుడ్‌మార్నింగ్‌ నాగర్‌కర్నూల్‌’
బొప్పల్లిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తెలకపల్లి, నవంబరు 28: మండల పరిధిలోని బొప్పల్లిలో సోమవారం నిర్వహించిన ‘గుడ్‌ మార్నింగ్‌ నాగర్‌కర్నూల్‌’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన గడపగడపకు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో అసంపూర్తిగా జరి గిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో అనేక అభి వృద్ధి కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండడంతో సర్పంచ్‌ను మందలించారు. కార్యక్రమంలో డీసీ సీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ హనుమంతురావు, ఎం పీపీ కొమ్ము మధు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదుల నరేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికా రులు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2022-11-28T23:20:17+05:30 IST