హరితహారం కోసం సిద్ధమవుతున్న మొక్కలు

ABN , First Publish Date - 2022-06-10T05:03:44+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కోసం మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.

హరితహారం కోసం సిద్ధమవుతున్న మొక్కలు
నాగులబండ ఫారె్‌స్టలో మొక్కలు

కొండపాక, జూన్‌ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కోసం మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది. కొండపాక మండలం మర్పడగ శివారులోని నాగులబండ కాన్సెన్వరీ నర్సరీలో మొక్కలు పురుడు పోసుకుంటున్నాయి. వర్షాకాలంలో మొక్కలను అందించేందుకు నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. హరితహారం కింద సిద్దిపేట జిల్లాలో కొన్నేళ్ల నుంచి నాటుతున్న మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఒక నాగులబండ నర్సరీలోనే వచ్చే హరితహారం కోసం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం కోసం 8 లక్షల మొక్కలు పెంచుతున్నారు. నర్సరీల్లో ఔషధ మొక్కలు, వేప, రావి, గుల్‌, పెల్లోఫామ్‌ చైనా బాదం, ఎగిసా, మర్రి, జువ్వి, మేడి, పెద్దఏగు, తెల్లమద్ది, తాని, బట్టగనప, ఆడవి మామిడి తదితర మొక్కలను పెంచుతున్నారు. కొన్ని నర్సరీల్లో పెరిగే మొక్కలు ఎండిపోకుండా ఎండ తెరలను ఏర్పాటు చేశారు. నాగులబండ నర్సరీలో రెండు, మూడు ఫీట్ల ఎత్తు పెంచిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 

Updated Date - 2022-06-10T05:03:44+05:30 IST