Helicopter: యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు వాహన పూజలు

ABN , First Publish Date - 2022-12-14T20:29:44+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో బుధవారం మొదటిసారి నూతన హెలికాప్టర్‌ (Helicopter)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Helicopter: యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు వాహన పూజలు

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో బుధవారం మొదటిసారి నూతన హెలికాప్టర్‌ (Helicopter)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఆలయానికి తీసుకువచ్చి పూజలు చేయిస్తుంటారు. అదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రతిమ మెడికల్‌ కళాశాల ఎండీ, ప్రతిమ గ్రూప్స్‌ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు (Boinapally Srinivasa Rao) నూతనంగా కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ను యాదగిరిగుట్ట (Yadagirigutta)కు తీసుకువచ్చారు. హెలికాప్టర్‌ను టెంపుల్‌ సిటీలోని హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ చేశారు.

పూజారులు అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు బంధువైన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. పూజల అనంతరం హెలికాప్టర్‌లో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, విద్యాసాగర్‌రావుతో పాటు వారి కుటుంబ సభ్యులు గిరిప్రదక్షిణ చేశారు. ఇదిలా ఉండగా బోయినపల్లి శ్రీనివాసరావు టెంపుల్‌ సిటీలోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లా డోనర్‌ కావడంతో వాహన పూజలు ఉచితంగా నిర్వహించారు.

Updated Date - 2022-12-14T20:29:46+05:30 IST