Home » Yadagirigutta
యాదగిరిగుట్టపై సీతారాముల కల్యాణోత్సవం శివాలయంలో కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా, ముందుగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆదివారం యాదగిరికొండ సందడిగా మారింది.
ప్రపంచ సుందరి, మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా కెజార్ హెల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. డెన్మార్క్ దేశానికి చెందిన విక్టోరియా భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పట్టుచీర ధరించి ఆలయానికి వచ్చారు.
తెలంగాణ శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజైన సోమవారం పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపు కథ వైదిక కార్యక్రమాలు ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు.
వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగ హోమం జరిపారు. వేద పారాయణాలు, మూలమంత్ర జపాల అనంతరం స్వామి వారిని భక్త జనులు రథాంగ దర్శనం చేసుకున్నారు. రథస్త కేశవుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
అభినవ అన్నమయ్యగా కీర్తినందుకున్న టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) ఇక లేరు. తిరుపతి భవానీనగర్లో నివాసం ఉంటున్న ఆయన ఆదివారం సాయం త్రం గుండెపోటుతో కన్నుమూశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ధ్వజారోహణం, దేవతాహ్వానం, భేరిపూజ ఆగమశాస్త్రం ప్రకారం సంప్రదాయ రీతిలో నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. లోకకల్యాణం కోసం ఏటా నిర్వహించే దేవదేవుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు స్వస్తివాచకంతో శ్రీకారం చుట్టారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి.