టీడీపీ వర్గీయులపై వేటకొడవళ్లతో దాడి

ABN , First Publish Date - 2023-07-12T01:13:55+05:30 IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, రాంబాబు, గోపాల్‌, బాషాపై వైసీపీ వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేశారు. మొదట గోపాల్‌పై దాడి జరిగింది. ఆస్పత్రిలో అతన్ని పరామర్శిస్తుం డగా మిగిలిన ముగ్గురిపై

టీడీపీ వర్గీయులపై వేటకొడవళ్లతో దాడి
దాడిలో గాయపడ్డ రాంబాబు

తాడిపత్రి, జూలై 11: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, రాంబాబు, గోపాల్‌, బాషాపై వైసీపీ వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేశారు. మొదట గోపాల్‌పై దాడి జరిగింది. ఆస్పత్రిలో అతన్ని పరామర్శిస్తుం డగా మిగిలిన ముగ్గురిపై పోలీసుల సమక్షంలో మరోమారు దాడి జరిగింది. తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గన్నెవారిపల్లి సర్పంచ ఉమా మహేష్‌, ముగ్గురు ఎంపీటీసీలు కలిసి.. ప్రజా సమస్యలపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందని టీడీపీ వర్గీయులు అంటున్నారు. వైసీపీ ఎంపీటీసీ రవి, మరికొందరితోపాటు ఈ దాడిలో పాల్గొన్నారని బాధితులు తెలిపారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-07-12T01:13:55+05:30 IST