వైభవంగా ధ్వజారోహణం
ABN , First Publish Date - 2023-05-04T00:05:13+05:30 IST
మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఉరవకొండ, మే 3: మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానఅర్ఛకులు ద్వారకానాథాచార్యులు శాస్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవానికి ముక్కోటి దేవతలను స్వామి వారి తరపున ఆహ్వానిస్తూ ధ్వజానికి మూలకారణమైన గరుత్మంతుడుని చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగిందని అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాత్రి ప్రాకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా పెద్దముష్టూరుకు చెందిన గుండ్రాయప్ప, పెద్ద ఓబన్న కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఈవో విజయ్ కుమార్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి జయంతి, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనోత్సవాలు నిర్వహించనున్నారు.