వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ ఇబ్బందులే
ABN , First Publish Date - 2023-02-17T00:37:39+05:30 IST
వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ ఇబ్బందులేనని మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న మండిపడ్డారు. గురువారం అనంతపురం అర్బన పరిధిలోని 31వ డివిజనలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.

మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న
అనంతపురం అర్బన, ఫిబ్రవరి 16 : వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ ఇబ్బందులేనని మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న మండిపడ్డారు. గురువారం అనంతపురం అర్బన పరిధిలోని 31వ డివిజనలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజనలోని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి వైసీపీది అరాచక పాలన అని ప్రజలకు వివరించారు. టీడీపీ హయాంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేసిన అభివృద్ధి తప్పా వైసీపీ పాలనలో చేసిందేమి లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డిష్ నాగరాజు, జిల్లా అధికారప్రతినిఽధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్, నాయకులు కూచి హరి, గుర్రం నాగభూషణం, సిమెంట్ పోలన్న, దళవాయి వెంకటనారాయణ, ముక్తియార్, మనోహర్, ఈడిగ మారుతీగౌడ్, రవి,మీసాల ఆది, పరందామ, డిష్ రామాంజి, తెలుగు మహిళలు సంగాతేజశ్విని, బుల్లే శివబాల, విజయశ్రీరెడ్డి, జానకి తదితరులు పాల్గొన్నారు.