Bhumana Karunakar Reddy : దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారు అంటే అది జగనే

ABN , First Publish Date - 2023-04-06T13:58:35+05:30 IST

ఐదు న్నర కోట్ల మంది ప్రజల దగ్గరకు రేపటి నుంచి 21 వరకp జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు.

Bhumana Karunakar Reddy : దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారు అంటే అది జగనే

తిరుపతి : ఐదు న్నర కోట్ల మంది ప్రజల దగ్గరకు రేపటి నుంచి 21 వరకp జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పేదరికం నిర్మూలనకు చేసిన కృషి చేసిన రాజకీయ నేతలు లేరన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే పేదల జీవితాలు మార్చాలని చూస్తున్నారన్నారు. గతంలో ఎందరో పాలన చేసినప్పటికీ పేదల జీవన ప్రమాణాలు మారలేదని భూమన అన్నారు. జగన్ పాలనలో పేదలు జీవన ప్రమాణాలు మారాయన్నారు. 20 శాతం ఉన్న ధనికులు పక్షాన ఉండాలా.. లేదంటే 60 శాతం ఉన్న పేదలు పక్షాన నిలబడాలా? అంటే పేదలు పక్షమే నిలబడిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడమే తప్ప, తాను వస్తే ఏమీ చేస్తాడు అనేది చెప్పడం లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 87 శాతం ప్రజలకు మూడున్నర లక్షలు రూపాయలు సగటున అందించారన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారాధులు, వాలంటీర్లు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్తామన్నారు. చంద్రబాబు చేసిన మోసం.. ప్రతి ఇంటికి ఇంటికి వెళ్తామని.. వాళ్ల అనుమతితో ఇంటికి స్టిక్కర్ అంటిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-06T13:58:35+05:30 IST