Chandrababu naidu: ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-08-15T09:42:11+05:30 IST

భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ రాష్ట్ర, దేశ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

Chandrababu naidu: ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

అమరావతి: భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) జరుపుకుంటున్న ఈ వేళ రాష్ట్ర, దేశ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్య్ర భారతమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అసమానతలు తొలగించి, పేదరికం రూపుమాపి తిరుగులేని శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన విజన్‌తో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ... చంద్రబాబు నాయుడు అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-08-15T09:42:11+05:30 IST