ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2023-05-15T02:38:09+05:30 IST

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవు రోజు కావడం, విద్యార్థులకు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
స్వామి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న భక్తులు

శ్రీకాళహస్తి, మే 14: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవు రోజు కావడం, విద్యార్థులకు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం 831, రూ.50 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 1,927 అమ్ముడయ్యాయి. అదేవిధంగా రూ.500 రాహుకేతు పూజా టిక్కెట్లపై 2,897మంది, రూ.750పై 1,193మంది, రూ,1,500పై 308మంది, రూ.2,500పై 248మంది, రూ.5వేల టిక్కెట్లపై 50మంది పూజలు చేసుకున్నారు. జిలేబీ 383, చిన్న లడ్డూలు 8,998, వడ 2,443, పులిహోరా 6,516, పెద్దలడ్డూలు 418 అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-15T02:38:09+05:30 IST