ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2023-07-29T23:50:15+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. మొహర్రం, వరుస సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
శ్రీకాళహస్తి, జూలై 29: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. మొహర్రం, వరుస సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 33వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 22,722 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.