రోడ్డుప్రమాదంలో ముక్కంటి ఆలయ ఉద్యోగి దుర్మరణం

ABN , First Publish Date - 2023-08-19T00:29:29+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథరెడ్డి(50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

 రోడ్డుప్రమాదంలో ముక్కంటి ఆలయ ఉద్యోగి దుర్మరణం
రఘునాథరెడ్డి మృతదేహం

శ్రీకాళహస్తి, ఆగస్టు 18: శ్రీకాళహస్తీశ్వరాలయ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథరెడ్డి(50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కడప జిల్లా సుండుపల్లికి చెందిన రఘునాథరెడ్డి కొన్ని సంవత్సరాలుగా ముక్కంటి ఆల య శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం విధులు ముగించుకున్న అనంతరం భూ లావాదేవీలపై రెవెన్యూ అధికారులను కలిసేందుకు తన స్వగ్రామానికి వెళుతున్నట్లు సహచరులకు చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో రాజంపేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆలయ అధికారులు, ఉద్యోగులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

Updated Date - 2023-08-19T00:29:29+05:30 IST