నల్లారి’ని బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో?: ఎమ్మెల్సీ డొక్కా

ABN , First Publish Date - 2023-03-14T03:28:01+05:30 IST

మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారని విన్నా. నిజానికి ఆయన బీజేపీలో చేరడం ద్వారా ఒక ఓటు మాత్రమే వస్తుంది.

నల్లారి’ని బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో?: ఎమ్మెల్సీ డొక్కా

తిరుమల, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారని విన్నా. నిజానికి ఆయన బీజేపీలో చేరడం ద్వారా ఒక ఓటు మాత్రమే వస్తుంది. అది కిరణ్‌కుమార్‌రెడ్డిదే. ఆయన కుటుంబ సభ్యులు కూడా బీజేపీకి ఓటు వేయరు. ఇలాంటి వ్యక్తులను బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో తెలీదు’’ అని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ఓటమిని అంగీకరించలేక ప్రతిపక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేయడం మాములే. ఒంటిమిట్టలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించిన టీటీడీని జాంబవంతుడి ఆలయాన్ని కూడా నిర్మించాలని అనేకసార్లు కోరాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-03-14T03:28:01+05:30 IST