శ్రీవారి ఆలయం ముందు రోజా కాళ్లు మొక్కిన మహిళలు
ABN , First Publish Date - 2023-08-11T02:15:42+05:30 IST
తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమెకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.
తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమెకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.అనంతరం శ్రీవారి ఆలయం బయటకు వచ్చిన రోజా కాళ్లకు ఇద్దరు మహిళలు మొక్కడం విమర్శలకు దారి తీసింది. సాధారణంగా శ్రీవారి ఆలయం ముందు ఇలా కాళ్లకు మొక్కడం చాలామంది ఆపచారం కింద భావిస్తారు. ఆలయం వెలుపల ఇద్దరు మహిళలు ఎదురెళ్లి రోజాకు తాంబూలం ఇవ్వడంతో పాటు బొట్టు పెట్టి మరీ కాళ్లు మొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది.