కళల గొప్పతనాన్ని నేటి తరానికి వివరించాలి

ABN , First Publish Date - 2023-05-06T00:48:26+05:30 IST

కళల గొప్పతనాన్ని నేటితరానికి వివరించాలని యానాం పరిపాలనాధికారి మునిస్వామి అన్నా రు.

కళల గొప్పతనాన్ని నేటి తరానికి వివరించాలి

యానాం, మే 5: కళల గొప్పతనాన్ని నేటితరానికి వివరించాలని యానాం పరిపాలనాధికారి మునిస్వామి అన్నా రు. కళాకారులు, కళల గొప్పతనాన్ని చాటిచెప్పడానికి పు దుచ్చేరి ప్రభుత్వం ప్రతిఏటా అత్యున్నత పౌరపురస్కారం కలైమామణి అవార్డును అందజేస్తుందన్నారు. శుక్రవారం భారతీయ దళిత సాహిత్య అకాడమీ(న్యూఢిల్లీ), స్ఫూర్తి సాహితీ సమాఖ్య యానాం సంయుక్త నిర్వహణలో కళైమమణి పురస్కార గ్రహీతలకు స్థానిక సర్వశిక్షఅభియాన్‌ సమావేశపు హాలులో ఆత్మీయ అభినందన సత్కారసభ నిర్వహించారు. ఈ సమావేశానికి కవి దాట్ల దేవదానంరాజు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆర్‌ఏ మునిస్వామి మాట్లాడుతూ యానాంలో వివిధ రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తూ రాణించడం అభినందనీయమన్నారు. పొనుగుమట్ల విష్ణుమూర్తి మాట్లాడుతూ సమాజంలో వివి ధ రంగాల్లో రాణిస్తున్న వారిని గౌరవించుకోవడం మన సంప్రదాయమన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలు డాక్డర్‌ వరుగు భాస్కరరెడ్డి (సాహిత్యం), కోరుకొండ ప్రసాద రావు (నాటకరంగం), ముమ్మిడి శ్రీవీరనాగప్రసాద్‌ (చిత్రకళ), గ్రంధి సత్యనారాయణమూర్తి (శిల్పం)లను ఘనం గా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ పరిపాలనాధికారి నామడి అప్పారావు, కవి మధునా పంతుల సత్యనారాయణమూర్తి, మల్లాడి శామ్యూల్‌, కాపగంటి సూర్యనారాయణమూర్తి, కమిడి ప్రభాకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-06T00:48:26+05:30 IST