court: రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

ABN , First Publish Date - 2023-08-09T19:44:01+05:30 IST

బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్‌లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.

court: రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్‌లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.


నిందితులు పాలుబోయిన విజయకృష్ణ, పాలుచూరి నికిల్‌కు 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నేరం జరిగిన ఏడాది లోపే నేరస్తులకు శిక్ష పడే విధంగా జిల్లా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిందితులకు శిక్ష పడటంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన రేంజ్ ఐజీ, జిల్లా ఎస్‌పీ, సిబ్బందిని డీజీపీ అభినందించారు.

Updated Date - 2023-08-09T19:59:34+05:30 IST