Home » AP Police
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
నిన్న ఎయిర్ పోర్ట్లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా కేసు నమోదు అయ్యింది. మరోవైపు దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
Andhrapradesh: పోలింగ్ సమయంలో మాచర్లలో ఎలాంటి ఘటనలకు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఏజెంట్లను పోలింగ్ బూత్ల వద్దకు రానీయకుండా వైసీపీ నేతలు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయితే మాచర్ల అల్లర్ల విషయంలో షాకింగ్ విషయం బయటపడింది. మాచర్ల అల్లర్లకు పలువురు పోలీసులే సహకరిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు... మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని గుర్తించారు.
Andhrapradesh: నంద్యాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే డోన్లో పాత కేసులతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలను ఎస్సీ, ఎస్టీ కేసులో ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిశాక కూడా వైఎస్సార్సీపీ (YSRCP) దాడులకు అంతులేకుండా పోతోంది. ఎన్నికల కమిషన్ (Election Commission) ఎన్నిచర్యలు తీసుకుంటున్నా వైసీపీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏపీ వ్యాప్తంగా నిన్న (సోమవారం) జరిగిన పోలింగ్లో వైసీపీ పలు కుట్రలు పన్నింది. పలు జిల్లాల్లో అరాచకాలు, అల్లర్లకు పెద్ద ఎత్తున పాల్పడింది.