Janasena Chief: తెలుగువారందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పవన్

ABN , First Publish Date - 2023-09-18T10:27:31+05:30 IST

విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుని ఆశీస్సులు మన భారతీయలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగువారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరిగే ఈ వినాయక చవితి పండుగ ఒక ఘనమైన వేడుక అని అన్నారు.

Janasena Chief: తెలుగువారందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పవన్

అమరావతి: విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుని ఆశీస్సులు మన భారతీయలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగువారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వినాయక చవితి (Vinayaka Chavithi) శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరిగే ఈ వినాయక చవితి పండుగ ఒక ఘనమైన వేడుక అని అన్నారు. తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఇతర మతస్తులు కూడా పాల్గొనడం భారతదేశంలో మత సహనానికి ఒక గీటు రాయిగా చెప్పుకొచ్చారు. వినాయక ఉత్సవాలు స్వతంత్ర పోరాటంలో ఒక భాగంగా ప్రారంభమై నేటి వరకు దేదీప్యమానంగా కొనసాగడం భారతీయులకు ఈ పండుగపై ఉన్న మక్కువ, భక్తిశ్రద్ధలకి తార్కాణంగా నిలుస్తోందన్నారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం హిందువులకు తొలి పండుగైన ఈ వినాయక చవితి... మన తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధికి ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా శుభాలు కలుగచేయాలని, కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఆర్ధికంగా సుఖశాంతులతో విరాజిల్లాలని ఆ లంబోదరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-18T10:31:33+05:30 IST